హైదరాబాద్ : జూన్ 1వ తేదీన ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్లైన్ తరగతులు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ను సాయంత్రం లోపు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఏటా జూన్ 1 నుంచే ఇంటర్ కాలేజీలు ప్రారంభవుతుండగా, గతేడాది కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా జూన్ 1 నుంచే ఆన్లైన్ క్లాసులను ప్రారంభించాలని ఇటీవలే ఇంటర్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు వాయిదా పడ్డాయి.