లక్నో : ఉత్తరప్రదేశ్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నది. ఆగ్రాకు సమీపంలోని రెండు గ్రామాల్లో 20 రోజుల్లో 64 మందిని కరోనా కాటేసింది. ఆగ్రాకు 40 కిలోమీటర్ల దూరంలోని ఎట్మాడ్పూర్ గ్రామంలో గత రెండు వారాల్లో కరోనాతో 14 మంది చనిపోయారు. దీంతో ఆ గ్రామంలో 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 27 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఎట్మాడ్పూర్ గ్రామంలో నెలకొన్న పరిస్థితే బామ్రౌలి గ్రామంలోనూ ఉంది. బామ్రౌలి కాటరా గ్రామం ఆగ్రాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 40 వేల వరకు జనాభా ఉంటారు. ఇక్కడ కూడా గత రెండు వారాల్లో కరోనాతో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడ్డారని, చివరకు ఊపిరాడక చనిపోయినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. బామ్రౌలి గ్రామంలో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించగా, మరో 46 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
యూపీ వ్యాప్తంగా ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఈ ఎన్నికల తర్వాతే గ్రామాల్లో అధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు.