జనగామ : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని హంగులతో ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట ఉండేందుకు సమీకృత కార్యాలయాల సముదాయాలను నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
సమైక్య రాష్ట్రంలో ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక సమస్యల పరిష్కారానికి ప్రజలు ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే చిన్న జిల్లాల ఏర్పాటు అన్నారు. పాలనా సౌలభ్యం కోసమే ఒకే దగ్గర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం