హైదరాబాద్ : కల్తీ విత్తన విక్రేతలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా రాష్ట్రంలోని పలుచోట్ల ఫర్టిలైజర్ దుకాణాల్లో శనివారం విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్లో 259.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, 74 మెట్రిక్ టన్నుల అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులు, 268 లీటర్ల నిషేధిత పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. రూ.58 లక్షల విలువైన సొత్తును సీజ్ చేశారు. అక్రమార్కులపై 4 క్రిమినల్ కేసులు సహా 17 దుకాణాలపై అధికారులు కేసులు నమోదు చేశారు.