యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. కొండ కింద 6 లైన్ల రోడ్లు, గిరి ప్రదక్షిణ రోడ్డు, పుష్కరిణి పనులను పరిశీలించారు. కొండపైన ప్రధానాలయం, లడ్డు విక్రయ కేంద్రం, క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, లిప్ట్ పనులను పరిశీలించిన ఆయన వైటీడీ ఏ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. ఆయన వెంట కలెక్టర్ అనితా రామచంద్రన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈఎన్ సీ గణపతి రెడ్డి, వైటీడీఏ అధికారులు ఆనంద్ సాయి, వెంకటేశ్వర్ రెడ్డి, ఈవో గీత తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
గుడ్న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!