యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. మొదటగా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధులు, ప్రసాద కాంప్లెక్స్, రథశాల, లిఫ్ట్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూ లైన్ల నిర్మాణం, ప్రధానాలయం పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట ఈఎన్సీ రవీందర్ రావు, గణపతి రెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈఓ గీత తదితరులు ఉన్నారు.