వరంగల్ : మూడేళ్ల క్రితం మూతపడిన నర్సంపేటలోని సబ్ జైల్ తిరిగి తెరిచేందుకు జైళ్ల శాఖ చర్యలు తీసుకుంటున్నది. గతంలో నర్సంపేట, కొత్తగూడ, గంగారం, గూడూరు, ఖానాపూర్, చెన్నారావుపేట నెక్కొండ, నల్లబెల్లి, దుగ్గొండి మండలాలకు చెందిన ఖైదీలు ఈ సబ్ జైలులో శిక్ష పొందేవారు. ఖైదీల సంఖ్య తక్కువగా ఉండటంతో మూడేండ్ల క్రితం ఇది మూతపడింది.
ప్రస్తుతం వరంగల్ కేంద్ర కారాగారం కూడా లేనందున జైళ్ల శాఖ నర్సంపేట సబ్ జైల్ పునర్నిర్మాణం చేపట్ఠింది. ఇందులో భాగంగా జిల్లా సబ్ జైలు అధికారి హనుమాన్ ప్రసాద్ సబ్ జైలును సందర్శించి పునర్నిర్మాణ పనుల పరిశీలించారు. త్వరలోనే సబ్ జైలు పునఃప్రారంభం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రజాస్వామ్య పద్ధతిలో టీఆర్ఎస్ సంస్థాగత నిర్మా ణం : మంత్రి సత్యవతి
ఎంగేజ్మెంట్ రింగ్తో స్టార్ క్రికెటర్
కామారెడ్డి జిల్లాలో చిరుతపులి కలకలం