యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని ప్రభుత్వ భూములను మంగళవారం జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, అదనపు కలెక్టర్ దీపక్తివారీ, ఆర్డీవో భూపాల్రెడ్డి పరిశీలించారు. గ్రామంతో పాటు గ్రామ శివారులలో ప్రభుత్వ భూములను గుర్తించేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఎంత ప్రభుత్వ భూమి ప్రజల ఆధీనంలో ఉంది. మిగులు భూమి ఎంత ఉంది అని సర్వే నిర్వహించారు. సర్వే పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, ఆర్ఐ జహంగీర్, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి