నిజామబాద్ : రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, మంజీర తీరం వెంట ఉండే గ్రామాల వారు అప్రమ్తతంగా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరంతో పాటు ఈ ఏడాది భారీ వర్షాలు కురియడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుందన్నారు. ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తుండడంతో ఇప్పటి వరకు సుమారు 20 టీఎంసీల నీరు మంజీరాలోకి విడుదల చేశామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో రాని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం గోదావరి నీటిని మల్లన్నసాగర్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టును నింపడానికి ఏర్పాట్లు చేసిందన్నారు.
గడిచిన వేసవి కాలంలో కొండ పోచమ్మసాగర్, హల్దీవాగు ద్వారా నిజాంసాగర్లోకి నీటిని తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే నని గుర్తుచేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు వాయిదా వేశామన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో వరద పరిస్థితులను పరిశీలిస్తున్నారన్నారు. వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాలని వ్యవసాయాధికారులకు ఆదేశించామన్నారు.
ఇవి కూడా చదవండి..
Heavy rains | భారీ వర్షాలతో తడిసి ముద్దయిన తెలంగాణ
వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం..ఒడ్డుకు చేర్చిన పోలీసులు
Gulab Cyclone |బూచినెల్లి -ఘనపూర్ మధ్య రాకపోకలు బంద్
IPL 2021 | వార్నర్ పనైపోయినట్లేనా.. తుది జట్టు ఎంపికపై కోచ్ రియాక్షన్ ఇదీ!