హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్థ్యం.. భారీస్థాయి వైద్యసదుపాయాలు, సిబ్బంది.. సరిగ్గా నెలరోజుల్లో అం దరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేసే యంత్రాం గం.. ఇదీ తెలంగాణ వైద్యారోగ్యశాఖ పనితీరు. కరోనా బారినుంచి ప్రజలను కాపాడాలన్న లక్ష్యంతో వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచుతూ, సిబ్బందిని అందుబాటులో ఉం చుతూ పెద్దసంఖ్యలో వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వ వివక్ష కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియనే బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
బీజేపీ పాలిత రా ష్ట్రాలు, కేంద్రానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకే వ్యాక్సిన్లను ఎక్కువగా కేటాయించడం, తెలంగాణకు కావాలని మొండిచేయి చూపడంతో రాష్ట్ర ప్రజలు వ్యా క్సిన్కు దూరమవుతున్నారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్లు పంపాలని రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. గత నెలలో తెలంగాణ ప్రజల ప్రస్తుత అవసరాల కోసం వెం టనే 30 లక్షల డోసులు కావాలని అడిగితే, 3 లక్షలు కూడా పంపించలేదు. పంపిన ప్రతిసారి రెండు లక్షలు, మూడు లక్షలు పం పుతూ తెలంగాణ పట్ల వివక్ష చూపింది. ఇదే సమయంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, బీహార్కు పెద్దమొత్తంలో వ్యాక్సిన్లు పంపించింది. తెలంగాణకు ఇప్పటి వరకు కేవలం 48 లక్షల డోసులు పంపి చేతులు దులుపుకున్న ది.
మే 1 నుంచి 18 ఏండ్ల పై బడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన కేంద్రం.. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఫెయిల్ అయ్యింది. తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత కారణంగా మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాకపోగా, రెండో డోసు వారికి వ్యాక్సిన్ ప్రశ్నార్థకమైంది. దీంతో రెండు రోజులపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేయాల్సిన దుస్థితి తలెత్తింది. కొత్తగా వ్యాక్సిన్లు వస్తేనే సోమవారం వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు.