వేములవాడ, మే 9: మాతృదినోత్సవం రోజే అమానవీయ ఘటన చోటుచేసుకొన్నది. ఓ వృద్ధురాలు అనారోగ్యంగా ఉండటంతో అద్దింటి యజమాని వెళ్లగొట్టగా.. ఆమె ఆస్తి తీసుకున్న మనుమరాలు(కొడుకు బిడ్డ) సైతం రోడ్డుపైకి గెంటేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం జరిగిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. పట్టణానికి చెందిన వెంకటస్వామి-ప్రమీల దంపతులకు నలుగురు కూతుళ్లు. వీరిలో ఇద్దరు మృతిచెందగా మిగిలిన ఇద్దరికి వెంకటస్వామి తన ఆస్తిని సమానంగా ఇచ్చా డు. పెద్ద కూతురు సునీతను 30 ఏండ్ల క్రితం షోలాపూర్ వ్యక్తితో పెండ్లిచేశాడు. భర్త చనిపోవడంతోవేములవాడకు తీసుకొచ్చి సాయినగర్లో ఇల్లు నిర్మించి ఇచ్చాడు. తనకంటూ ఏమి లేకపోవడంతో వెంకటస్వామి భార్య, తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతని తల్లి తులసమ్మ(103) ఆరోగ్యం క్షీణించడంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి తెస్తుండడంతో కూతురు సునీత ఇంటికి వెళ్లాడు. నాన్నమ్మకు నాలుగు రోజులు ఆశ్రయం ఇవ్వాలని కోరగా, ఆమె ససేమిరా అన్నది. ఇంటి నుంచి తల్లిదండ్రులతోపాటు నాన్నమ్మను బయటకు గెంటేసింది. దీంతో వెంకటస్వామి రోడ్డుపై టెంట్ వేసుకొని తల్లిని చూసుకుంటున్నాడు. కాగా విషయం తెలుసుకొన్న పట్టణ ఎస్సైలు శేఖర్, రామచంద్రంగౌడ్ స్పందించి వృద్ధురాలిని రాజన్న ఆలయ శంకరపురం ధర్మశాలలో ఆశ్రయం కల్పించారు.