నిజామాబాద్ : ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్లో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 91,746 క్యూసెక్కులు, బాలేగావ్ ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తి దిగువకు 93,443 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేశారు.
ఈ వరద గురువారం సాయంత్రానికి ఎస్సారెస్పీకి చేరుకుంటుందని ఎస్సారెస్పీ ఏఈఈ వంశీ తెలిపారు. బుధవారం ఉదయం ఎస్సారెస్పీలోకి ఉదయం 6 గంటలకు 80,544 క్యూసెక్కులు, 9 గంటలకు 75,090 క్యూసెక్కులు, మధ్యాహ్నం 3 గంటలకు వరకు 52,591 క్యూసెక్కుల వరద కొనసాగింది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1080.20 అడుగుల (52.968 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఈ సీజనులో 34.970 టీఎంసీల వరద వచ్చి చేరింది. ప్రాజెక్ట్ నుంచి అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలకు 420 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 150 క్యూసెక్కుల నీటిని వాన కాల పంటలకు విడుదల చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
350 కిలోల గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి
కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం