హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీకి (YSRTP) భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇందిరా శోభన్.. పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపించారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచి, ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ధన్యవాదాలు’ అని చెప్పారు. ప్రజా జీవితంలోనే కొనసాగుతానని వెల్లడించారు.