హాంగ్కాంగ్: వజ్రాలు అతి విలువైనవి అనేది అందరికీ తెలిసిన విషయమే. వేలం పాటలో ఇవి కోట్ల రూపాయల ధర పలుకుతాయి. తాజాగా పర్పుల్-పింక్ డైమండ్ ‘ది సాకురా’ కూడా భారీ ధర పలికింది. ఆ డైమండ్ను హాంగ్కాంగ్లో వేలం వేయగా రూ.213 కోట్లు (29.3 మిలియన్ డాలర్లు) పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నారు.
కాగా, జెనీవాలో గత నవంబర్లో ‘ది సాకురా’ అనే 14.8 క్యారెట్ల పర్పుల్-పింక్ డైమండ్ ‘ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్’ వేలంలో 27 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే దోషనివారణ ఓవల్ రత్నం ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్ 23 మిల్లియన్ డాలర్లు పలికినట్లు సమాచారం. కాగా దీనిపై క్రిస్టీ వేలం సంస్థ స్పందిస్తూ.. ఆభరణాల వేలం చరిత్రలో ”ది సాకురా” మరో ముఖ్యమైన అధ్యాయాన్ని నమోదు చేసిందని తెలిపింది. వేలంలో రికార్డు ధర పలుకడంపై సంతోషం వ్యక్తంచేసింది.
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
ఆఫ్ఘనిస్తాన్లో విస్తరిస్తున్న తాలిబాన్.. మూడు జిల్లాలు స్వాధీనం
మయన్మార్లో అంతర్యుద్ధానికి అవకాశాలు : యూఎన్ హెచ్చరిక
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..