హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓ వైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా, మరోవైపు కోలుకొని డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. ఆదివారం కొత్త గా 4,976 కేసులు నమోదుకాగా, 7,646 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. దీంతో రికవరీ రేటు 86.22 శాతానికి చేరగా, జాతీయ సగటు 82.1 శాతంగా నమోదైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 851, రంగారెడ్డి జిల్లాలో 417, మేడ్చల్ మల్కాజిగిరిలో 384, సిద్దిపేటలో 304, కరీంనగర్లో 271, వరంగల్ అర్బన్లో 218 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర దీర్ఘకాలికి వ్యాధులతో 35 మంది మరణించారు.