సంగారెడ్డి : జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. 3,429 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.263 టీఎంసీల నీరుంది. నీటి ఎత్తు మీటర్లలో 521.303 ఉండగా, ఔట్ఫ్లో 386 క్యూసెక్కులుగా కొనసాగుతున్నది. ఈ సీజన్లో ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 4.575 టీఎంసీల నీరు వచ్చిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ప్రాంతంలో బుధవారం 16 మీ.మీటర్లు వర్షం కురిసింది. మరికొద్ది రోజులు వరద ఇలాగే కొనసాగితే ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.మరికొద్ది రోజులు వరద ఇలాగే కొనసాగితే ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్