ములుగు : ప్రభుత్వం కృషికి తోడు వాతావరణం అనుకూలించడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు ఘననీయంగా పెరుగాయి.మోటర్ సహాయం లేకుండానే ఓ బోరు బావి నుంచి నీళ్లు వాటికవే పైకి వస్తున్న సంఘటన జిల్లా కేంద్రంలోని లోకం చెరువు పక్కన ఉన్న మామిడి తోటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కూన గణపతి రావు అనే రిటైర్డ్ ఇంజినీర్ బోరు బావిని పది రోజుల క్రితం తవ్వించాడు.
ఈ క్రమంలో 80 ఫీట్ల నుంచే బోరుబావిలో నీళ్లు పడ్డాయి. బోరు బావి తవ్వించినప్పటి నుంచి ఇప్పటివరకు భూగర్భ జలాలు పెరగడంతో నీళ్లు బోరు బావి పైకి వచ్చి మోటర్ లేకుండానే గత పది రోజులుగా ఇంచున్నర మందంతో వాటి కవే నీళ్లు పైకి వస్తున్నాయి. దీంతో గణపతి రావు బోరు బావికి ప్రత్యేక పైపులు అమర్చి మోటర్ సహాయం లేకుండానే తన మామిడి తోటకు నీళ్లు పారిస్తుండటం విశేషం.