వరంగల్ రూరల్ : సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయింది. కాళేశ్వరం, దేవాదుల జలాలతో పంట దిగుబడి విపరీతంగా పెరిగిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలో దాన్యం సేకరణ, కరోనా నిర్మూలనకు చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలు కొనుగోలు చేస్తలేదు.రైతుల బాధలు తెలిసిన నాయకుడు మన సీఎం. రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రైతులు ఆందోళన చెందవద్దు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం.
ధాన్యం అమ్మకాలలో రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించి ప్రతి గింజ కొనే విదంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే విదంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
మిల్లర్లు సహకరించక పోయినా రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. కరోనా నివారణ చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని వసతులు ఉన్నాయి.
ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లి ఆగం కావొద్దన్నారు. వ్యాక్సిన్ సరఫరా కూడా వేగంగా జరుగుతుందని మంత్రి తెలిపారు. లాక్ డౌన్ పొడిగింపు విషయం పై ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతి నిధులు, అధికారుల అభిప్రాయాలు సేకరిస్తున్నాం. క్యాబినెట్ మీటింగ్ లో సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేశవాపురం లిఫ్ట్కు శంకుస్థాపన
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్