హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్ ప్రధానంగా శ్వాస వ్యవస్థపై దాడి చేస్తుంది. వైరస్ ముక్కు లేదా నోటి నుంచి గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి, అక్కడున్న వాయు కుహరాలను, కండరాలను ఇబ్బంది పెడుతుంది. దీంతో దగ్గు, దమ్ము, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.
కొందరిలో న్యుమోనియాకు దారితీస్తున్నది. ఆస్తమా, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక రోగుల్లో సమస్య మరింత తీవ్రం అవుతున్నది. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే వైరస్ ముప్పు కాస్త తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. శ్వాస వ్యవస్థలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే మన రోగ నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తుందని అంటున్నారు. దీంతో గొంతులో మంట, దురద, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. వీటిని ముందుగానే గుర్తించగలిగితే వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీయకముందే కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోండి
గుర్తించడం ఎలా?
ఇవీ కూడా చదవండి…
ఏ చక్కెర తింటే ఆరోగ్యానికి మంచిది?
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!