మంత్రి హరీశ్రావు, నిరంజన్రెడ్డి ఆదేశం
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రంలో భారీగా ఆయిల్పామ్ సాగుకు చర్యలు చేపట్టాలని మంత్రులు హరీష్రావు, నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సోమవారం ఆయిల్పామ్ సాగుపై బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగులో మొక్కల లభ్యతే ప్రధాన అంశమని చెప్పారు. నర్సరీల్లో భారీగా ఆయిల్పామ్ మొక్కల పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.