టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
సంగారెడ్డి, ఏప్రిల్ 22: కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో టీఆర్ఎస్వీ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గురువారం ప్రభుత్వ అతిథిగృహం ఆవరణలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాలతో టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో క్షరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రెండు జోన్లను కొనసాగించి తెలంగాణ బిడ్డలకు మోసం చేశారని, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చదువుకున్న బిడ్డలకు న్యాయం చేసేందుకు 7 జోన్లు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లతో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరడంతో ప్రజలు సంతోషంలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు, కంబాలపల్లి సర్పంచ్ శ్రీహరి, నాయకులు పాండు నాయక్, సందీప్గౌడ్, రత్నం, రాము, నసీర్, జగన్, అజ్జు పాల్గొన్నారు.
హుస్నాబాద్లో..
హుస్నాబాద్, ఏప్రిల్ 22: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం టీఆర్ఎస్వీ, యూత్ విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సూరంపల్లి పరశురాం, ఏఎంసీ డైరెక్టర్ కూతాటి విజయభాస్కర్, కౌన్సిలర్ బొజ్జ హరీశ్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్కే అఫ్రోజ్, యూత్ నాయకులు గందె చిరంజీవి, సిరిసిల్ల సతీశ్, అష్రాఫ్, చిట్యాల సంపత్, రాజేశ్, నవీన్ పాల్గొన్నారు.