ఆమనగల్లు, ఏప్రిల్ 21 : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో బుధవారం శ్రీరామ నవమిని నిరాండబరంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయం, అయ్యసాగర్ ఆలయంతో పాటు వివిధ గ్రామాల్లో ఆంజనేయ ఆలయాల్లో శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయాల్లో సీతారామ కల్యాణం నిర్వహించారు. కల్వకుర్తి నియోజకవర్గ శిరసనగండ్ల ఆలయంలో నిర్వహించిన కల్యాణానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పాల్గొన్నారు. పట్టణంలో సీతారామ కల్యాణ వేడుకల్లో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
కడ్తాల్లో..
కడ్తాల్, ఏప్రిల్ 21 : మండల కేంద్రంతో పాటు మైసిగండి రావిచేడ్, చల్లంపల్లి, కర్కల్పహాడ్, ముద్విన్, మాదారం, చరికొండ గ్రామాల్లో సీతారాముల వారి కల్యాణోత్సవం నిరాడంబరంగా జరిగింది. కల్యాణోత్సవంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాధవి దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ శిరోలీ, నాయకులు భాస్కర్రెడ్డి, చందోజీ, నరేందర్రెడ్డి, ఆంజనేయులు, మోహన్రెడ్డి పాల్గొన్నారు.
మంచాల మండలంలో…
మంచాల ఏప్రిల్ 21 : మండలంలోని ఆరుట్ల, మంచాల, రంగాపూర్, నోముల, కాగజ్ఘట్ తదితర గ్రామాల్లోని దేవాలయాల్లో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సీతారామకల్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు విష్ణువర్ధన్రెడ్డి, మమత, శ్రీనివాస్రెడ్డి, జగన్రెడ్డి, ఎంపీటీసీలు చీరాల రమేశ్తో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్లో..
తుర్కయాంజాల్, ఏప్రిల్ 21 : కొహెడలో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో సీతారాముల కల్యాణానికి మాజీ ఉప సర్పంచ్ కాటెపల్లి నాగిరెడ్డి, సామల ప్రభాకర్ రెడ్డి, కందాల యాదిరెడ్డి దంపతులు తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు సమర్పించారు. కమ్మగూడ 23వ వార్డులో కల్యాణాన్ని జరిపించారు. కౌన్సిలర్ ప్లోర్ లీడర్ కల్యాణ్ నాయక్, శ్రీనివాస్ నేత, సత్యనారాయణ రెడ్డి దంపతులు, నాయకులు గుండ్లపల్లి ధన్రాజ్ గౌడ్, సత్యం పాల్గొన్నారు.
మాడ్గులలో..
మాడ్గుల, ఏప్రిల్ 21 : మండల కేంద్రంతో పాటు ఇర్విన్, కొలుకులపల్లి, గిరికొత్తపల్లి, అందుగుల, నాగిళ్ల, దొడ్లపహడ్, బ్రహ్మణపల్లి గ్రామాల్లో సీతారాముల కల్యాణం నిరాండంబరంగా జరిగింది.
ఆదిబట్ల పరిధిలో..
ఆదిబట్ల, ఏప్రిల్ 21 : ఉప్పరిగూడ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, బీఎన్ఆర్ సంస్థల అధినేత నందారెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీశైలం, నాయకులు జైపాల్రెడ్డి, సత్తిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, యాదగిరిరెడ్డి, పోరెడ్డి పాల్గొన్నారు. ఎలిమినేడులో ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సతీమణి ముకుందమ్మ సర్పంచ్ అశోక్వర్ధన్రెడ్డి దంపతులతో కలిసి పూజలు చేశారు. ఆదిబట్ల, కొంగరకలాన్లో రాములవారి కల్యాణం జరిగింది.