హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశ సైనికదళంలో ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ ఆర్టిలరీ సెంటర్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సెంటర్ను ప్రారంభించి 60 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి మేజర్ జనరల్ పీఆర్ మురళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సెంటర్ లో తొలి కమాండెంట్గా పనిచేసిన కల్నల్ గురుప్రతాప్సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సెంటర్లో ఇప్పటివరకు సేవలందించిన మాజీ అధికారుల సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం ఈ ఆర్టిలరీ సెంటర్లోని 143 మంది సిబ్బంది ఆర్మీ దవాఖానకు తమ అవయవాలను దానం చేయనున్నట్టు ప్రకటించారు.