హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ ) : వీఐటీ ఏపీ స్కూల్ ఆఫ్ లా.. లో రెండు రోజుల ‘ఇంట్రా మూట్ కోర్ట్’ పోటీలను నిర్వహించారు. బీఏ ఎల్ఎల్బీ (అనర్స్), బీబీఏ ఎల్ఎల్బీ (అనర్స్) కోర్సుల్లోని 18 జట్లు పోటీపడ్డాయి.
మంతెన భవ్య, పెనుమాక శ్రీనిఖి, పిళ మౌనిషా, సాయిలతో కూడిన జట్టు గెలుపొందింది. వైస్చాన్స్లర్ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్, స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ బెనర్జీ విజేతలకు బహుమతులు అందజేశారు.