ఖైరతాబాద్, సెప్టెంబర్ 14: ఖైరతాబాద్ మహా గణపతి వచ్చే ఏడాది మట్టితో రూపుదిద్దుకోనున్నాడు. 70 అడుగుల ఎత్తయిన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మండపంలోనే నిమజ్జనం చేస్తామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు 65 అడుగులకుపైగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రూపొందించిన భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఉత్సవ కమిటీ.. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.