కంది/ సంగారెడ్డి : కరోనా కట్టడిలో ఐఐటీ హైదరాబాద్ బృంద సభ్యులు మరో ముందడుగు వేశారు. తక్కువ ధరకే మంచి రక్షణనిచ్చే సరికొత్త ఫేస్ ఫీల్డ్ను రూపొందించారు. ఐఐటీ హైదరాబాద్లోని డిజైన్ డిపార్ట్మెంట్కు చెందిన హెచ్ఓడీ ఆధ్వర్యంలో లేజర్ కటింగ్ ద్వారా తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో సరికొత్త ఫేస్ ఫీల్డ్ను ఆవిష్కరించారు. ఫేస్ షీల్డ్ను పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా డిజైన్ చేశారు. ఫీల్డ్ను కూడా అవసరం ఉన్నప్పుడు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. 0.5 మిల్లీమీటర్ల మందం కలిగిన పాలిపరోపిలిన్ షీట్ను దీని తయారీలో వాడారు. ధర రూ 30 నుంచి 50 వరకు ఉంటుందని తెలిపారు. ఈ ఫేస్ షీల్డ్ను ఇప్పటికే ఐఐటీలోని విద్యార్థులతోపాటు సిబ్బందికి అందజేశారు. సరికొత్త ఫేస్ షీల్డ్ తయారీ చేసిన బృందాన్ని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు.