హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ కి చెందిన ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్.. కొత్త తరహా కరోనా టెస్ట్ కిట్ను డెవలప్ చేశారు. కోవీహోమ్ ఎలక్ట్రికల్ కిట్తో ఇంట్లోనే సులువుగా కోవిడ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఆర్టీపీసీఆర్ టెస్ట్తో సమానంగా ఈ ఈ రిజల్ట్ ఉంటుందని ప్రొఫెసర్ శివ గోవింద్ తెలిపారు. కేవలం 30 నిమిషాల్లో కోవీహోమ్తో ఫలితాలు వస్తాయి. లక్షణాలు ఉన్నా, లేకున్నా ఆ ఫలితాల్లో తెలుస్తుంది. నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ఈ పరీక్షను చేయవచ్చు ఆయన తెలిపారు. కోవీహోమ్ టెస్టింగ్ కిట్ను డెవలప్ చేసిన పరిశోధకుల బృందంలో డాక్టర్ సూర్యస్నాట త్రిపాఠి, సుప్రజా పట్ట, స్వాతి మోహంతితో పాటు ఇతర విద్యార్థులు కూడా ఉన్నారు.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గోవింద్ ఆధ్వర్యంలో ఈ కిట్ను తయారు చేశారు. చాలా చౌకైన ధరలో టెస్టింగ్ కిట్ను రూపొందించామని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు చెప్పారు. అయితే భారీ స్థాయిలో కిట్లను ఉత్పత్తి చేసేందుకు భాగస్వామ్యుల కోసం చూస్తున్నామని ప్రొఫెసర్ తెలిపారు. కోవీహోమ్ కిట్తో ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ట్రయల్స్ నిర్వహించారు. ఈ కిట్ ధర రూ.400 గా నిర్ణయించారు. కిట్ వాడే విధానాన్ని ఈ వీడియోలో వివరించారు.