కొలంబో : శ్రీలంక – భారత్ జట్ల మధ్య జరిగే టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ కంటే నాలుగు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ నెల 17న తొలి వన్డే, 19న రెండో వన్డే, 21న మూడో వన్డే జరుగనుంది. ఈ నెల 24న తొలి టీ-20 మ్యాచ్ జరుగనుండగా.. 25న రెండో మ్యాచ్, 27న మూడో మ్యాచ్ జరుగనుంది. ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సిరీస్ ఈ నెల 13 తేదీన ప్రారంభం కావాల్సి ఉన్నది. భారత్తో సిరీస్కు ముందు శ్రీలంక జట్టులో కరోనా కేసులు బయటపడ్డాయి. ఇటీవల ఇంగ్లండ్కు వెళ్లి వచ్చిన టీమ్లో మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారినపడగా.. ఆ తర్వాత టీమ్ డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్కు సైతం కరోనా సోకింది. ప్రస్తుతం కరోనా ఇద్దరూ.. చికిత్స పొందుతున్నారని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంక జట్టు ఇంగ్లండ్లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడింది. ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ టీమ్లో ముగ్గురు ప్లేయర్స్ సహా మొత్తం ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. అక్కడికి నుంచి స్వదేశానికి వచ్చిన శ్రీలంక టీమ్కు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. గ్రాంట్ ఫ్లవర్, నిరోషన్ వైరస్ బారినపడ్డట్లు తేలింది.