హుజూరాబాద్ టౌన్, జూన్ 5 : హుజూరాబాద్లో ఈటల రాజేందర్ మళ్లీ ఎమ్మెల్యేగా పోటీచేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు చిత్తుగా ఓడిస్తారని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ స్పష్టంచేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఈటలలాంటి నాయకులను వందల మందిని సీఎం కేసీఆర్ తయారుచేశారని, హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చి నిలబెట్టినా ప్రతి కార్యకర్త పార్టీ గెలుపుకోసం కృషిచేస్తారని స్పష్టంచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి, కాంగ్రెస్కు నూకలు చెల్లాయని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల తదితరులు పాల్గొన్నారు.