జగిత్యాల : ప్రముఖ చరిత్రకారుడు డా. జైశెట్టి రమణయ్యను డా. సినారె విశిష్ట పురస్కారం వరించింది. అక్కెపల్లి ఫౌండేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో కీ.శే.అక్కెపల్లి మమత స్మారకార్థం డా. సినారె పురస్కార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని డా.జైశెట్టి రమణయ్య స్వగృహములో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అక్కెపల్లి బాల్ రెడ్డి.. రమణయ్యకు పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు.
రుద్రమసాహితీ సంస్థ వ్యవస్థాపకురాలు డా. అడువాల సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, సామాజికవేత్త రేగొండ నరేష్, తెలంగాణ జాగృతి ప్రతినిధులు మెన్నేని నీలిమ, వుజగిరి జమున, రుద్రమ సాహితీ సంస్థ ప్రతినిధులు చిందం సునీత, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.