చివ్వెంల, సెప్టెంబర్ 11: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గుట్టల్లో వినాయక విగ్రహం వెలుగుచూసింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు శనివారం వినాయకుడి విగ్రహాన్ని గుర్తించి పూజలు జరిపించారు. అక్కడ బయటపడింది విజయ గణపతి దేవుడిగా గుర్తించారు. కాకతీయుల కాలానికి పూర్వమే ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిపి ఉండొచ్చని చెప్తున్నారు. వినాయక చవితి రోజు విగ్రహం బయట పడటం శుభపరిణామంగా భావిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.