ఖమ్మం : ఆదర్శప్రాయుడు మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ చేకూరి కాశయ్య అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ అన్నారు. ఆదివారం కాశయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కాశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
ఖమ్మం జిల్లాలో ఎంతో మందికి రాజకీయ పాఠాలు నేర్పిన ఘనత కాశయ్యదన్నారు. ఆయన జీవితం భావితరాలకూ ఆదర్శమన్నారు. అనంతరం కాశయ్య జీవితంపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కమ్మ మహాజన సంఘం జిల్లా అడ్యక్షుడు వేజడ్ల సురేశ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మిర్యాలగూడెం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Bee attack : తేనెటీగల దాడి..చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి
భూమికి చేరిన స్పేస్ ఎక్స్ వాహక నౌక
Tragedy | చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి
Salman Khan: బిగ్ బాస్ షోకి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సల్మాన్ ఖాన్