హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎర్త్డ్యామ్పై సోమవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఎర్త్డ్యామ్పై ఉన్న గడ్డికి నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించాయి.
మంటలు ఆర్పేందుకు ఎస్పీఎఫ్ యత్నించారు. సాధ్యం కాకపోవడంతో హాలియా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని దాదాపు 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదంలో ఎర్త్డ్యామ్పై కిలోమీటర్ మేర గడ్డి కాలిబూడిదైంది. గతేడాది సైతం ఎర్త్డ్యామ్పై ఇదే తరహాలో ప్రమాదం సంభవించింది.
సాగర్ ప్రాజెక్టు భద్రత పర్యవేక్షణపై అధికారులు, సిబ్బంది సరిగ్గా దృష్టిపెట్టని కారణంగానే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.