నాగర్కర్నూల్ : జిల్లా దవాఖానలో కరోనా చికిత్స, ఆక్సిజన్ సమకూర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ నాగభూషణంను ఆదేశించారు.
సోమవారం ఆయన జిల్లా దవాఖానను సందర్శించారు. కరోనా చికిత్స కోసం రెండో అంతస్తులో స్పెషల్ వార్డులో చికిత్స పొందుతున్న పేషెంట్లను పరిశీలించి కలెక్టర్ వారితో మాట్లాడారు. ప్రజలు అనవసర ఆందోళనకు చెందకుండా ధైర్యంగా ఉండాలన్నారు.
లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ వారిని కోరారు. దవాఖానలో నిల్వ ఉన్న ఆక్సిజన్ సిలిండర్లును పరిశీలించారు. ఆక్సిజన్ నిల్వలు వాటి పనితీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నా వెంటనే సంప్రదించాలని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం