హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)/దుండిగల్ : హైదరాబాద్ జీడిమెట్లలోని మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ శుక్రవారం ‘ఐ సర్వైవ్’ పేరిట ప్రత్యేక క్యాంపును ప్రారంభించింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి హెల్త్సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, ఎండీ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి క్యాన్సర్ బాధితుడు, వారి కుటుంబాలు ‘ఐ సర్వైవ్’ ప్రివిలేజ్ కార్డు పొందడం వల్ల తమ దవాఖానలోని అనేక సదుపాయాల్లో రాయితీ పొందవచ్చని చెప్పారు. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.