హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): అది రాంచంద్రాపురం పోలీసుస్టేషన్ పరిధి. ఈ నెల 4న ఆదివారం అంగడి జరుగుతున్నది. కూరగాయల కోసం ఓ వృద్ధురాలు రద్దీలో నిలబడింది. ఆమె పక్కనే ఓ ఆటో ఆగింది. కొద్దిసేపటికే మెడలో గొలుసు పోయిందంటూ వృద్ధురాలు కింద పడిపోయింది. గమనించిన స్థానికుడు గణేశ్యాదవ్ ఆటోను వెంబడించి ఇక్రిసాట్ జంక్షన్ వద్ద ఆటోను ఆపి గొలుసు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించాడు. మంగళవారం సీపీ సజ్జనార్ గణేశ్ యాదవ్ను సత్కరించారు.