కోల్కతా, మే 2: పశ్చిమ బెంగాల్లోని జుమరియా స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన జేఎన్యూ విద్యార్థిసంఘం మాజీ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమెకు కేవలం 24,818 ఓట్లు వచ్చాయి. తృణమూల్ అభ్యర్థి హరేరామ్ సింగ్ 71 వేల ఓట్లతో విజయం సాధించారు.