హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, నిమ్న వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ముందు చూపువల్లే వెనుకబడిన వర్గాలకు అవకాశాలు అనేక లభిస్తున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారు. విద్యతోనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆశయంమేరకు, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో 125కి పైగా గురుకుల విద్యాలయాలు ప్రకటించి ఈ ఆరున్నర ఏళ్లలో వాటిని 1079 కు పెంచిన ఏకైక సీఎం కేసిఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 70 ఏళ్లలో ఈ రాష్ట్రంలో 298 గురుకుల విద్యాలయాలుంటే తెలంగాణ వచ్చిన తర్వాత వీటి సంఖ్య మూడింతలకు పైగా పెరగడం విద్యకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు.
ప్రభుత్వం కల్పించిన పథకాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చేవిధంగా ఎదగడమే అంబేద్కర్కు ఇచ్చే నిజమైన నివాళి అని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సాగర్ వెనుకబాటుకు జానారెడ్డే కారణం
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహాత్య