హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) రూపొందించిన భూ ఉపరితలం నుంచి నింగిలోని లక్ష్యాన్ని ఛేదించే మీడియం రేంజ్ మిస్సైల్(ఎంఆర్ఎస్ఏఎం)ను బీడీఎల్(మిస్సైల్, స్ట్రాటజిక్ సిస్టమ్స్) డైరెక్టర్జనరల్ ఎంఎస్ఆర్ ప్రసాద్ ప్రారంభించారు. మంగళవారం కంచన్బాగ్లోని బీడీఎల్ యూనిట్లో ఆయన జెండా ఊపి క్షిపణి రవాణాను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ సీఎండీ సిద్ధార్థమిశ్రా మాట్లాడుతూ.. బీడీఎల్ ఆవిష్కరణలకు ఈ క్షిపణి మంచి ఉదాహరణ అని చెప్పారు. కార్యక్రమంలో రిసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ డైరెక్టర్ బీహెచ్వీఎస్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణి త్రివిధ దళాలకు సేవలందించనున్నది. డ్యుయల్ పల్స్ రాకెట్మోటార్, డ్యుయల్ కంట్రోల్ వ్యవస్థ దీనిలోని ప్రత్యేకతలు.