హైదరాబాద్ : కొవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో భారత్, బ్రిటన్ల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే అటు బ్రిటన్లోనూ, ఇటు భారత్లోనూ కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో ఇరుదేశాల మధ్య విమాన సర్వీసులు పున: ప్రారంభమయ్యాయి. నిన్న (6వ తేదీ) లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం హైదరాబాద్ చేరుకుంది. ఈవాళ తిరిగి ఉదయం సుమారు 07.15 గంటలకు 121 మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరి వెళ్లింది.