హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఎంత బిజీగా ఉన్నా కరోనా బాధితుల కోసం నేనున్నానంటూ మంత్రి కే తారకరామారావు సహాయం అందిస్తూనే ఉన్నారు. టెస్టులు చేయించాలని, దవాఖాన బెడ్ కావాలని, ఇంజెక్షన్ కావాలని.. ఇలా బాధిత కుటుంబాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను తీర్చేందుకు సొంతంగా ఒక బృందాన్ని ఏర్పాటుచేసుకొన్న మంత్రి.. పని పూర్తయ్యేదాకా ఫాలోఅప్ చేస్తున్నారు. సహాయం అందిందని బాధితులు రిైప్లె ఇవ్వగానే.. అందరూ త్వరగా కోలుకోవాలని స్వయంగా మంత్రే రీట్వీట్ చేస్తున్నారు. మంత్రి చురుకైన స్పందనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నా. అలుపెరుగకుండా మీరు చేస్తున్న సాయం నా హృదయాన్ని తాకింది. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. మీరూ జాగ్రత్తగా ఉండండి’ అని విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ట్వీట్ చేశారు. ‘నేను ట్విట్టర్ ఓపెన్ చేస్తున్న ప్రతీసారి చూస్తున్నా.. అందరిలా కాకుండా ఓ జంటిల్మ్యాన్ వేగంగా, జెన్యూన్గా బాధితులకు సహాయం చేస్తున్నారు. సింప్లీ ఆసమ్ కేటీఆర్ సర్’ అని అమిర్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయాల్లో అండగా నిలుస్తున్నారని, ఆ కుటుంబాలు ఎన్నటికీ సాయాన్ని మర్చిపోలేవని, ఇలాంటి జంటిల్మ్యాన్ను చూడలేదని, రాజకీయనాయకులపై ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగిస్తున్నారని, హ్యాట్సాఫ్ అని మంత్రి కేటీఆర్ను కొనియాడుతున్నారు.