మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
ఆమెజాన్ సంస్థ అందించిన మూడు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి ప్రారంభం
హాజీపూర్, మే 17 : కరోనా కట్టడికి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నామని కలెక్టర్ భారతీ హోళీకేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఆమెజాన్ సంస్థ వారు జిల్లాకు అందించిన మూ డు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి సోమవారం ఆమె ప్రారంభించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో కొవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుం డా మెరుగైన వైద్యంతో పాటు మందులు అందిస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ ఆమెజాన్ సంస్థ ప్రతినిధి శ్రావణ్ కృషితోనే ఈ కాన్సన్ట్రేటర్లు వచ్చాయన్నా రు. కొవిడ్ నివారణకు జిల్లా యంత్రాంగం, వై ద్యాధికారులు, ప్రజాప్రతినిధులు విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇంటి వద్ద హోం ఐసోలేషన్ వసతి లేని వారికి జిల్లాకేంద్రం లో 100 పడకలతో కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పా రు. ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్ అందజేస్తున్నామన్నా రు. కరోనా మృతదేహాల అంత్యక్రియలకు ఎ లాంటి ఖర్చు లేకుండా మంచిర్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించడం, దీంతో పాటు అటవీశాఖ ఆధ్వర్వంలో ఉచితంగా కర్రను అందించ డం అభినందనీయమన్నారు. వ్యాధిగ్రస్తులను తరలించడానికి ప్రైవేట్ అంబులెన్స్ల ధరలను నియంత్రణకు కలెక్టర్ చొరవ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యం, మంచిర్యాల పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి జిల్లా వ్యవసాయ, సహకార, రవాణా శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 15 రోజుల్లో మరింత ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం, మిల్లులకు తరలింపు, తరలించాల్సిన ధాన్యం, మిల్లుల్లో అన్ లోడింగ్, ఇంకా ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉంది వివరాలను ట్యాబ్లో నమోదు చేసి పూర్తి నివేదికను అందించాలన్నారు. అధికంగా ధాన్యం తరలించిన కొనుగొలు కేంద్రాల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య, మంచిర్యాల ఆర్డీవో వేణు, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ గోపాల్, అధికారులు పాల్గొన్నారు.
కాల్ సెంటర్ను వినియోగించుకోవాలి
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కాల్ సెంటర్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయంలో అందించే రెమిడెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ దవాఖానల్లో ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు విక్రయిస్తే 08736-250501కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని ఆమె కోరారు.