హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ శుక్రవారం బీబీ కా ఆలమ్ ఊరేగింపు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ అధికారులతో కలిసి సీపీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఊరేగింపును పర్యవేక్షించారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర పోలీసు అధికారులతో కలిసి అంజనీ కుమార్ బీబీ కా ఆలమ్కు దట్టి సమర్పించారు. ఊరేగింపుకు నగర పోలీసులు విస్తృత ఏర్పాటు చేశారు. ప్రజల సంరక్షణార్థం ర్యాపిడ్ యాక్షన్ బలగాలతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో మోహరించారు.