దుండిగల్, ఏప్రిల్ 2 : కాలనీలు, బస్తీలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బాచుపల్లిలోని క్రాంతినగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్సీని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ.. సంక్షేమ సంఘాల ప్రతినిధులు కాలనీల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో క్రాంతినగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జీవీ.రెడ్డి, శ్రీనివాస్, జై సింహ తదితరులు పాల్గొన్నారు.