ముంబై: కొవిడ్-19 నేపథ్యంలో విమాన ప్రయాణం చేయడానికి వెనుకాడుతున్న ప్రజలను ప్రోత్సహించేందుకు ఓ ఎయిర్లైన్స్ .. కరోనా పరీక్షల కోసం అదనపు మనీ ఇస్తోంది. భారతదేశంలోనే రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా పేర్కొందిన స్పైస్ జెట్ కరోనా పరీక్షల కోసం ప్రతి ప్రయాణికుడికి రూ.299 (నాలుగు డాలర్లు) ఖర్చు చేస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో కరోనా పరీక్షకు వసూలు చేస్తున్న మొత్తంలో మూడోవంతు మాత్రమే.
స్పైస్ హెల్త్ అనే పేరిట స్పైస్జెట్ కరోనా పరీక్షల నిర్వహణకు ఓ వేదిక పని చేస్తున్నది. ముంబై, ఢిల్లీల్లో సాధారణ ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి మొబైల్ వసతులు కల్పించింది. ఇంటింటికి వెళ్లి శాంపిల్స్ సేకరించినందుకు ఒక్కొక్కరికి రూ.499 చార్జి చేస్తున్నది.
సింగపూర్, హంకాంగ్లతో పోలిస్తే కరోనా నుంచి త్వరితగతిన కోలుకున్న భారత్లో విమానయాన రంగంపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. 2019తో పోలిస్తే 2020 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో స్పైస్జెట్ రూ.56.96 కోట్ల నష్టాన్ని చవిచూసింది.