కోల్సిటీ, మార్చి 28: తనను గొప్పవాడిని చేసిన తల్లి పుట్టిన రోజున ఆ కొడుకు కానుకను చూసి ఆ అమ్మ మురిసిపోయింది. తల్లి పుట్టిన రోజున అందరిలా కేక్లు కట్ చేయడం.. స్వీట్లు పంచలేదు. ఒక మంచి సాయం చేయాలని తలచి అనాథ వృద్ధులకు కానుకను అందజేశాడు సింగరేణి రామగుండం-3 డివిజన్ పరిధిలోని ఓపెన్కాస్టు-1లో ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తున్న రాజవరపు శ్రీనివాస్. శ్రీనివాస్ తల్లి రాజవరపు శేషు పుట్టిన రోజున పురస్కరించుకొని ఆదివారం తన తల్లి కోరిక మేరకు గోదావరిఖని తిలక్నగర్లోని శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వృద్ధుల ఆశ్రమంలో వేసవి కాలంలో వృద్ధులు ఇబ్బంది పడవద్దన్న ఉద్దేశంతో రూ.40వేలు వెచ్చించి ఎయిర్ కండీషనర్ (ఏసీ) కొనుగోలు చేశాడు. తన ఆత్మీయ మిత్రుడు, ఓసీపీ-1లో ఉద్యోగి పోతుల చంద్రపాల్ ద్వారా ధర్మశాస్త్ర ఆశ్రమ నిర్వాహకుడు కౌటం బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా కౌటం బాబు మాట్లాడుతూ, గతంలో ఎండాకాలం వేడిమిని తట్టుకోలేక ఒకరిద్దరు వృద్ధులు చనిపోయేవారని గుర్తు చేశారు. ఈ ఏడాది సింగరేణి అధికారి శ్రీనివాస్ ఉదారతతో ఆ ఇబ్బంది ఉండబోదని వివరించారు. సేవా దృక్పథంపై కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ కూడా చదవండి..
అన్ని మున్సిపాలిటీల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్