ఇల్లందకుంట, సెప్టెంబర్ 15 : తమ బతుకు రాతను మార్చిన సీఎం కేసీఆర్కు గుండెల్లో గుడి కట్టిందో దళిత కుటుంబం. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం పాతర్లపల్లికి చెందిన కోడెం రవీందర్-రాజమణి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు. దంపతులిద్దరూ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. స్వరాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూపంపిణీ ఈ కుటుంబానికి వరమైంది. 2014 ఆగస్టు 15న సీఎం కేసీఆర్ చేతులమీదుగా మూడెకరాల పట్టాను రాజమణి అందుకున్నారు. అందులో బోరు వేసి వరి సాగు చేసుకుంటున్నారు. తమ బతుకులు బాగు చేసినందుకు కృతజ్ఞతగా ఇంట్లో దేవుళ్ల చిత్రపటాల పక్కన సీఎం కేసీఆర్ ఫొటోను పెట్టుకొని పూజిస్తున్నారు. ప్రస్తుతం దళితబంధులో భాగంగా వీరి ఖాతాలో రూ.10 లక్షలు జమ కాగా, వాటితో ట్రాక్టర్ కొనుక్కుంటామని చెబుతున్నారు. తమకు కొత్తదారి చూపిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.