హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ప్రజలు పార్టీ ఆవిర్భావం నుంచి సీఎం కేసీఆర్వెంటే ఉన్నారని, ఆ నియోజకవర్గం టీఆర్ఎస్కు కంచుకోటని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండానేనని స్పష్టంచేశారు. సోమవారం హైదరాబాద్లో హుజూరాబాద్ నియోజకర్గ కాంగ్రెస్నేత, ఎంపీ రేవంత్రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీమంత్రి ముద్దసాని దామోదర్రెడ్డి కుమారుడు కశ్యప్రెడ్డి.. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, విప్ బాల్కసుమన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు మంత్రి హరీశ్రావు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ప్రపంచం అబ్బురపడే, దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తమ నియోజకవర్గంలోనే ప్రారంభించటం హుజూరాబాద్ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనకు ఆకర్షితుడినై టీఆర్ఎస్లో చేరానని కశ్యప్రెడ్డి పేర్కొన్నారు. హూజూరాబాద్లో వందల మంది కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా అఖండవిజయం సాధించేది టీఆర్ఎస్సేనని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ అభ్య ర్థి గెలుపుకోసం అంకితభావంతో పనిచేస్తామని ప్రకటించారు.