హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల రాజేందర్ చేసిందేమీ లేదు. బీసీ బిడ్డను అని చెప్పుకునే ఆయన కూతురు, కుమారుడికి రెడ్డి అని పేరు చివరలో పెట్టాడు. రెడ్డి అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈటల దళితులపై ఎన్నో కేసులు పెట్టి వేధింపులకు గురి చేశాడు. ఆయన అరాచకాలు భరించలేక అందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఆయన సొంత ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారు. ప్రజల మేలు కోసం ఆయన రాజీనామా చేయలేదు. మా ఊరిలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.
– విజయ్ కుమార్ ( మరిపెల్లి గ్రామం, కమలాపూర్ మండలం )
సీఎం కేసీఆర్ నిరుపేదల గురించి ఆలోచిస్తున్నారు. ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు నిరుపేదల గురించి పట్టించుకోలేదు. ఏ పథకం పెట్టినా నిరుపేదలకు ఉపయోగపడేలా కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారు. దళిత బంధుతో దళితులు ధనికులుగా మారాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టారు. మా ఓట్లతో మరోసారి సీఎం కేసీఆర్ను గెలిపించుకుంటాం. – మోరే మధు ( ఇందిరా నగర్ కాలనీ, హుజూరాబాద్ పట్టణం )