హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8, కాగా 11వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ అక్టోబర్ 13. 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్ 2న ఫలితాలను వెల్లడించనున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం విదితమే. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
హుజూరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని బద్వేలు నియోజకవర్గానికి కూడా అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనుంది. ఇక దేశ వ్యాప్తంగా మరో 28 అసెంబ్లీ, 3 లోక్సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది.